తెలుగు వారందరికీ లోకమాత దీవెనలు ఇవ్వాలి

22 Sep, 2017 01:37 IST|Sakshi
తెలుగు వారందరికీ లోకమాత దీవెనలు ఇవ్వాలి

తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: శరన్నవరాత్రుల సందర్భంగా ప్రప్రంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద  మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ జరుపుకుంటామని ఆయన అన్నారు.

విజయదశమి పండుగకు ముందు భక్తిశ్రద్ధలతో లోకమాతను కొలిచే పర్వదినాలు ఈ నవరాత్రులని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దుర్గామాత అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

మరిన్ని వార్తలు