విజయవంతం చేయాలని తలశిల పిలుపు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం కూడా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగనుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం పిలుపు నిచ్చారు. 264వ రోజు సోమవారం వైఎస్ జగన్ 9.1 కిలోమీటర్లుపాదయాత్ర చేశారన్నారు. ఆనందపురం మండలం గుమ్మడివాని పాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నీళ్లకుండీలు, మిందివానిపాలెం, గుడిలోవ, తర్లువాడ క్రాస్, దుక్కవానిపాలెం, ఈగలవానిపాలెం, లొడగల వానిపాలెం మీదుగా ఆనందపురం వరకు సాగిందన్నారు.
265వ రోజు మంగళవారం ఆనందపురం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర నేల్తేరు క్రాస్, పాలవలస క్రాస్, సీతమ్మపాలెం క్రాస్, పందలపాక బీసీ కాలనీ, పందలపాక క్రాస్, తర్లువాడ, బాకూరుపాలెం క్రాస్ మీదుగా ముచ్చెర్ల క్రాస్ వరకు సాగనుందన్నారు. ఆనందపురం మండలం పల్లెల మీదుగా 265వ రోజు సాగనున్న పాదయాత్రలో వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని తలశిల పిలుపునిచ్చారు.