తనకంటివారిపల్లె నుంచి ప్రజాసంకల్పయాత్ర

19 Dec, 2017 08:49 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారానికి 39వ రోజుకు చేరింది. ఆయన ఇవాళ ఉదయం ధర్మవరం మండలం తనకంటివారిపల్లె నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి 8:30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. రామసాగరం క్రాస్, యడలంకపల్లె క్రాస్ మీదుగా 10 గంటలకు మరల గ్రామానికి చేరుకుని రైతులతో వారి సమస్యలపై చర్చిస్తారు. డీడీ కొట్టాలకు చేరుకున్న అనంతరం 12:30 గంటలకు అక్కడ భోజన విరామం తీసుకుంటారు.

2:45 గంటలకు బుక్కపట్నం నుంచి పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. 3:15 గంటలకు మంగళ మడక క్రాస్ చేరుకుంటారు. అక్కడినుంచి ధర్మవరం నియోజకవర్గంలోని గరుగు తాండ, 4.30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని అగ్రహారం క్రాస్ మీదుగా సాయంత్రం 5 గంటలకు పాముదుర్తి వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు.

మరిన్ని వార్తలు