ప్రజాసంకల్పయాత్ర 85వ రోజు షెడ్యూల్‌

11 Feb, 2018 19:15 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిస్కారానికి భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 85వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర  షెడ్యూల్‌ను విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం అనంతాపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి సిద్దన కొండూరు, సిద్దన కొండూరు హరిజనవాడ మీదుగా పారికోటకు పాదయాత్ర చేరుకుంటుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అయ్యపు రెడ్డి పాలెం మీదుగా పెద్ద కొండూరుకు పాదయాత్ర చేరుకుంటుంది. వైఎస్‌ జగన్‌ రాత్రి అక్కడే బసచేస్తారు. దారిపొడవునా జననేతకు ప్రజలు పెద్ద ఎత్తునా స్వాగతం పలుకుతున్నారు. 

మరిన్ని వార్తలు