మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు రూ. 3 కోట్లు

28 Apr, 2020 10:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్‌ తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అక్కడ చిక్కుకుపోయిన దాదాపు 5 వేల మంది మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ. 3 కోట్లు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ప్రత్యేక రవాణా సదుపాయం ద్వారా.. గుజరాత్‌లోని తెలుగు మత్య్సకారులను ఏపీకి రప్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

చదవండి : రైతులకు క్రెడిట్, డెబిట్‌ కార్డులు

మరిన్ని వార్తలు