-
సముద్రంలో బోటు బోల్తా...అందరూ సురక్షితం..
-
విశాఖ: గల్లంతైన మత్స్యకారులు సేఫ్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలిసింది. అప్పికొండ ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, అలల ధాటికి బోటు మునిగిపోవడంతో వారంతా అక్కడ ఉన్నట్టు తెలిసింది. వివరాల ప్రకారం.. సోమవారం వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలియడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు క్షేమంగా అప్పికొండ ప్రాంతంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, సముద్రపు అలల ధాటికి వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ క్రమంలో బోటు దెబ్బతినడంతో బోటుపై భాగంలోనే వారు ఆరుగురు ఉండిపోయారు. నిన్న రాత్రంతా వారు సముద్రంలోనే ఉండిపోయారు. అనంతరం, అప్పికొండ తీరానికి చేరుకోగానే గంగపుత్రులు అధికారులకు సమాచారం అందించారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. వీరిలో కారి చిన్నారావు (45), కారి నరేంద్ర(18), మైలపల్లి మహేష్ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చినసత్తెయ్య (55), వాసుపల్లి పొడుగు అప్పన్న(32) ఉన్నారు. ఇక, వీరు గల్లంతైన నేపథ్యంలో కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ గాలింపు చర్యలు చేపట్టాయి. -
విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం సముద్రంలో ఆరుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V 1-MO -2736 నెంబర్ బోట్లో వేటకు వెళ్లారు. రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు, కోస్ట్గార్డు సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన మత్సకారుల స్వస్థలం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారిగా సమాచారం. చదవండి: చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా! -
Fact Check: ఇంత వక్రీకరణా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారమే అజెండాగా పెట్టుకున్న ఈనాడు రామోజీరావు తన మార్కు దిగజారుడు పాత్రికేయాన్ని మరోసారి చూపించారు. పల్నాడు జిల్లాలో ఓ మత్స్యకారుని అనుమానాస్పద మృతికి కూడా వక్రభాష్యం చెబుతూ పోలీసు శాఖపై విష ప్రచారం చేశారు. పోలీసుల వేధింపులతోనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నారని నిరాధార కథనాన్ని ప్రచురించి పాఠకులను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్కే వెళ్లని వ్యక్తిని ఎస్సై ఎలా వేధింపులకు గురిచేస్తాడని, వేధింపులకు గురైన వ్యక్తి చేపల వేటకు వెళ్తాడా అన్న కనీస జ్ఞానం కూడా ఈనాడుకు లేదు. అందుకే ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తికి చెందిన మత్స్యకారుడు చౌడిపల్లి దుర్గారావు గతంలో అక్రమ మద్యం కేసులో నిందితుడు. ఆయన తన నాటు పడవలో మరికొందరితో కలిసి తెలంగాణ నుంచి పడవలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అధికారులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు, మరో నిందితుడు పరారయ్యారు. అక్రమ మద్యం కేసులో దుర్గారావును ఐదో నిందితుడు (ఏ5)గా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దుర్గారావు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఆదివారంతో సహా ప్రతి రోజూ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, గత 3 ఆదివారాలు ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టలేదు. గత ఆదివారంనాడు (జనవరి 28న) కూడా పోలీస్ స్టేషన్కు రాకుండా చేపల వేట కోసం కృష్ణా నదిలోకి వెళ్లాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుర్గారావు మృతదేహాన్ని ఆయన బావమరిది బ్రహ్మాజీ తీసుకువచ్చారు. మృతిపై భిన్న వాదనలు దుర్గారావు మృతి పట్ల ప్రత్యక్ష సాక్షులు భిన్నమైన వాదనలు వినిపించడం గమనార్హం. మొదట కృష్ణా నది ఒడ్డున దుర్గారావు మృతదేహాన్ని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాసేపటికే దుర్గారావు మృతదేహాన్ని కృష్ణా నది నుంచి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఆయన మెడకు ఉరివేసుకుని నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కాగా నది నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ కెమెరాలతో తీసిన వీడియోలో ఆయన మెడకు ఎలాంటి తాడూ లేదు. కానీ కాసేపటికి దుర్గారావు మెడ చుట్టూ తాడు బిగించి ఉన్నట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. దీనిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గారావు మెడకు మొదట పసుపు రంగు తాడు లేదని, తరువాతే చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నేర చరిత్ర ఉన్న టీడీపీ నేతలు రెడ్యా నాయక్, వజ్ర నాయక్ మృతుడి కుటుంబ సభ్యులను ప్రభావితం చేసి వెల్దుర్తి ఎస్సై శ్రీహరి వేధింపుల వల్లే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు చేయించారు. సోదరులైన వారిద్దరిపై పలు క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. వారిద్దరే దుర్గారావు కుటుంబ సభ్యులతో జాతీయ రహదారిపై ధర్నా చేయించారు. వాస్తవాలు ఇలా ఉంటే దీన్ని వక్రీకరిస్తూ ఈనాడు పోలీసులపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించడం గమనార్హం. ఇవి వాస్తవాలు కాగా, ఎస్సై వేధింపుల వల్లే దుర్గారావు మృతి చెందాడని వక్రీకరిస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దుర్గారావు అసలు ఆదివారంనాడు పోలీసు స్టేషన్కే వెళ్లలేదు. అతన్ని పోలీసులు వేధింపులకు గురిచేస్తే మానసిక వ్యధతో ఉన్న వ్యక్తి పడవలో చేపల వేటకు వెళ్లగలడా? ఈ కనీస జ్ఞానం తప్పుడు కథనం రాసే వారికి ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు... దర్యాప్తు దుర్గారావు మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన ఎలా మృతి చెందారనే విషయంపై ప్రత్యక్ష సాక్షులే పరస్పర భిన్నమైన కారణాలు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం పోస్ట్మార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక రావల్సి ఉంది. మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు శాఖాపరమైన దర్యాప్తు కూడా చేపట్టారు. వెల్దుర్తి ఎస్సై శ్రీహరికి మెమో జారీ చేశారు. ఈ ఉదంతంపై సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని మాచర్ల సీఐ షమీముల్లాను ఆదేశించారు. -
సూళ్లూరుపేటకు సీఎం జగన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement