సాగునీరు కోసం వైఎస్సార్‌సీపీ నేతల రాస్తారోకో

8 Aug, 2018 08:11 IST|Sakshi
రాఘురామిరెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, వైఎస్సార్‌ : కేసీ కెనాల్‌ నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ మైదుకూరు నేషనల్‌ హైవేపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రఘరామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, అంజాద్‌ బాషా పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు