'మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదు'

1 Sep, 2014 11:23 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్న దొర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ సహా చాలాచోట్ల మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప సమాధానం ఇస్తూ మహిళలపై  దాడులు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

మరిన్ని వార్తలు