న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు గవర్నర్ గా రఘురామ్ రాజన్ కే రెండో సారి బాధ్యతలు అప్పజెప్పాలా..? వద్దా..? అంటే కచ్చితంగా రాజన్ కే సెకండ్ ఇన్నింగ్స్ అప్పజెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఫైర్ బ్యాండ్ బీజేపీ నేతలే రాజన్ పదవి పొడిగింపును వ్యతిరేకిస్తున్నా... రాజన్ కు మద్దతు పలికేందుకే మెజార్టీ సభ్యులు ఓకే చెబుతున్నారు. దీంతో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ మద్దతు అంతాఇంతా కాదని అర్థమవుతోంది.
9,168 మందిపై ఈటీమార్కెట్లు.కామ్ జరిపిన సర్వేలో 69శాతం మంది రాజన్ ఫర్ ఫెక్ట్ అని.. ఎలాంటి వంకలు పెట్టాల్సినవసరం లేదంటూ 10వ ర్యాంకును ఇచ్చారు. 87శాతం మంది ఆర్ బీఐ గవర్నర్ గా రెండోసారి రాజన్ నే ఎంపికచేయాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. దీంతో భారత ప్రజల హృదయాల్లో, మైండ్ లో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ కు సముచిత స్థానం ఉన్నట్టు ఈ సర్వే ద్వారా వెల్లడవుతోంది. ఈటీమార్కెట్లు. కామ్ వెల్లడించిన ఈ సర్వే ఫలితాలపై రాజకీయ నాయకులు మౌనం వహిస్తున్నారు.
సర్వేలో వెల్లడైన కీలక అంశాలు...