కల్యాణ్ జ్యువెలర్స్ మిని వజ్రాల దుకాణాలు

14 Jan, 2016 03:08 IST|Sakshi
కల్యాణ్ జ్యువెలర్స్ మిని వజ్రాల దుకాణాలు

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ కల్యాణ్ జ్యువెలర్స్ తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన 14 ‘మై కల్యాణ్’ ఔట్‌లెట్స్‌ను మిని వజ్రాల దుకాణాలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు వజ్రాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కల్యాణ్ జ్యువెలర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మిని వజ్రాల దుకాణాల్లో రూ.8,000-రూ.25,000 ధరల శ్రేణిలో అత్యంత ఆదరణ పొందిన పలు రకాల వజ్రాభరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం వజ్రాల విక్రయాలు వేగంగా పెరుగుతోందని తెలిపింది. వజ్రాలు ఖరీదైనవి, ప్రత్యేకమైనవి అనే అపోహలను తొలగిస్తూ సామాన్యులకు కూడా వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి మిని వజ్రాల దుకాణాలు దోహదపడతాయని కల్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టి.ఎస్.కల్యాణ రామన్ తెలిపారు.
 
 

>
మరిన్ని వార్తలు