ముంబై : కరోనా భయాలతో పాటు ముసురుతున్న మాంద్య మేఘాలతో శుక్రవారం ఆరంభంలో కుప్పకూలిన స్టాక్మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఓ దశలో కీలక సూచీలు పది శాతంపైగా పతనమై 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేసిన సంగతి తెలసిందే. ట్రేడింగ్ పునఃప్రారంభమైన తర్వాతా నెగెటివ్ జోన్లో కొనసాగిన సూచీలు ఇంట్రాడేలో పుంజుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ 1680 పాయింట్ల లాభంతో 34,458 పాయింట్ల వద్ద, 479 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,069 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.