లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

27 Jan, 2016 09:44 IST|Sakshi

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు ఉదయం 40 పాయింట్లకు పైగా లాభపడి  24,643 వద్ద ట్రేడ్ అవుతోంది.  ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 50 పాయింట్లతో ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభమైంది. మరోవైపు రూపాయి 15 పైసలు బలహీనపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 67.98గా ఉంది.

 

>
మరిన్ని వార్తలు