టయోటా ఇటియోస్ క్రాస్ ఎక్స్‌ లాంచ్‌

20 Sep, 2017 18:52 IST|Sakshi
టయోటా ఇటియోస్ క్రాస్ ఎక్స్‌ లాంచ్‌

సాక్షి, న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ  టయోటా కంపెనీ క్రాసోవర్ వాహనం, ఇటియోస్ క్రాస్  ఎక్స్‌  ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.   రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలోపెట్టుకుని  కొస్మొటిక్‌ ఫీచర్స్‌ను అప్‌ గ్రేడ్‌ చేసిన దీన్ని మార్కెట్లో విడుదల చేసింది.  రూ. 6.88 లక్షలు రూ. 8.22 లక్షల మధ్య ఉండనున్నాయి.( ఎక్స్‌ షోరూ కోలకత్తా)డ్యాష్‌ బోర్డును  కార్బన్‌  ఫైబర్‌తో కొత్తగా రూపొందించింది. 6.8 ఇ‍న్ఫోటైన్‌మెంట్‌ టచ్‌ స్క్రీన్‌ను  కూడా అదనంగా చేర్చింది. ఇది రివర్స్‌ పార్కింగ్‌ కెమెరాగా ఉపయోగపడనుంది.

టయోటా ఇటియోస్ క్రాస్ ఎక్స్‌  1.2 పెట్రోల్‌, 1.4 డీజిల్‌ ఇంజీన్‌ వెర్షన్‌తో, 5 స్పీడ్‌ మాన్యుయల్‌ ట్రాన్సిమిషన్‌తో పెట్రోల్, డీజిల్ రెండు  వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్లో   80పీఎస్‌ గరిష్ట శక్తి . 104 ఎన్ఎమ్ టార్క్‌, 17.71 కెంపీఎల్‌,  డీజిల్ ఇంజిన్ వేరియంట్‌  68పీఎస్‌ శక్తిని ,  170ఎన్‌ఎం టార్క్‌ను , 23.59 కెఎంపీఎల్‌ను అందిస్తుంది.  


 

>
మరిన్ని వార్తలు