రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు

2 Dec, 2014 00:44 IST|Sakshi
రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు

సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) ప్రకటించిన నిర్యత్‌శ్రీ అవార్డును పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వంకా రవీంద్రనాథ్ అందుకున్నారు. సోమవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో ఎగుమతుల విషయంలో విశేష ప్రతిభ కనబరిచిన వ్యాపారవేత్తలకు ఈ అవార్డును ప్రకటిస్తారు. ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్ అయిన వంకా రవీంద్రనాథ్ తలనీలాల ఎగుమతుల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మహిళలకు ఉపాధి కల్పించడం, విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టడంలో గుర్తించదగిన ప్రతిభ, వృద్ధి చూపినందుకు ఆయనను ఈ అవార్డు వరించింది.

మరిన్ని వార్తలు