నగల దుకాణంలో ఐటీ శాఖ తనిఖీలు

10 Jan, 2018 20:09 IST|Sakshi

చిత్తూరు కార్పొరేషన్‌: నగరంలోని ఓ ప్రముఖ బంగారపు నగల దుకాణంలో ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం పది గంటల నుంచి దుకాణం షట్టర్‌ మూసివేసి సోదాలు జరిపారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న130 దుకాణలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు తెలిసింది. చిత్తూరులోని దుకాణంలో తమిళనాడు అధికారులు సోదాలు చేశారు. అమ్మకం, కొనుగోళ్ల ఇన్వాయిస్‌లు, ట్యాక్స్‌ రిట్నర్న్‌​ వంటి కీలక పత్రాలు పరిశీలించారు. దీంతో నగరంలోని చిన్నచిన్న బంగారపు దుకాణదారులు అప్రమతమై కొన్ని దుకాణాలను మూసివేశారు. సాయంత్రం​ వరకు ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటంతో నగరంలోని పలు నగల దుకాణదారుల్లో అలజడి మొదలైంది.

మరిన్ని వార్తలు