జైపూర్ : రాజస్థాన్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 32మందికి చేరుకుంది. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ అధికారి సుభాష్ మిశ్రా ధృవీకరించారు. పదుల సంఖ్యలో గాయపడగా.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందజేయిస్తున్నారు.
కాగా, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు సవాయ్ మాధోపూర్లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజాము అదుపు తప్పి వంతెన మీద నుంచి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెలికితీసి, సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే స్టీరింగ్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.