హరియాణా గ్యాంగ్‌ రేప్‌ : నిందితుడి అరెస్ట్‌

16 Sep, 2018 13:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో సీబీఎస్‌ఈ టాపర్‌పై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరం జరిగిన స్ధలంలోని ట్యూబ్‌వెల్‌ యజమానిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ స్థలాన్ని నిందితులకు అతను రెంట్‌కు ఇచ్చాడని వెల్లడించారు. ఘటనలో సైనిక జవాను సహా పరారీలో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. వీరి అరెస్ట్‌కు సహకరించే సమాచారం అందించిన వారికి పోలీసులు రూ లక్ష నగదు రివార్డును ప్రకటించారు. 

కనియా జిల్లాలో కోచింగ్‌ క్లాస్‌కు వెళ్లి తిరిగివస్తున్న ఓ యువతిని బుధవారం ముగ్గురు యువకులు కిడ్నాప్‌చేసి గ్యాంగ్‌రేప్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 9 మంది బాధితురాలిపై లైంగికదాడికి దిగారు. ఆమె స్పృహ కోల్పోవడంతో బస్టాండ్‌లో పడేసి వెళ్లిపోయారు.మరోవైపు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌డబ్ల్యూసీ).. వీలైనంత త్వరగా దీనిపై నివేదికను సమర్పించాలని హరియాణా డీజీపీ సంధూను ఆదేశించింది.

మరిన్ని వార్తలు