మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

3 Aug, 2019 15:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హయత్‌ నగర్‌ ఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసిన మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌ రవి శేఖర్‌ను పోలీసులు నేడు మీడియా ముందుకు తీసుకురానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాచకొండ సీపీ మహేశ్‌ భగ్వత్‌ రవి శేఖర్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రవి శేఖర్‌పై పలు కేసులు ఉండటంతో భిన్న కోణాల్లో పోలీసులు విచారణ చేశారు. గత నెల 23న హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థినిని ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రవిశేఖర్‌ కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసందే.

మరిన్ని వార్తలు