భూమిలో వాటా కోసం కుటుంబ సభ్యుల దాడి
తల్లితో పాటు తమ్ముడు, చెల్లి కలిసి ఘాతుకం
రెడ్డిపేట ఘన్పూర్(ఆర్) తండాలో ఘటన
రామారెడ్డి(ఎల్లారెడ్డి): ఆస్తి తగాదాల నేపథ్యంలో కన్న తల్లితో పాటు తోడ బుట్టిన వారు దాడి చేయడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందా డు. ఈ ఘటన రామారెడ్డి మండలం లోని రెడ్డిపేట పరిధిలో గల ఘన్పూర్(ఆర్) తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై వినయ్కుమార్ కథనం ప్రకారం.. తండాకు చెందిన కార్యకు ఇద్దరు కుమారులు లక్ష్మణ్(48), రాము, ఇద్దరు కుమార్తెలు కళావతి, లీలావతి ఉన్నారు. పెద్ద కుమారుడైన లక్ష్మణ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తమకున్న ఆరెకరాల భూమిపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది.
తమకు ఆస్తి పంచివ్వాలని సోదరుడితో పాటు కళావతి అన్న లక్ష్మణ్తో గొడవ పడుతున్నారు. ఇంట్లో పండుగ కోసం పుట్టింటికి వచ్చిన కళావతి తనకూ భూమిలో వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాము, కళావతితో పాటు తల్లి కార్య లక్ష్మణ్పై దాడికి పాల్పడ్డారు. గా యపడిన లక్ష్మణ్ను స్థానికులు కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందు తూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి రూరల్ సీఐ భిక్షపతి ఘటన స్థలాన్ని సందర్శించారు.