రాజంపేటలో రోడ్డు ప్రమాదం; చిన్నారి మృతి

27 Dec, 2019 11:49 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : రాజంపేట మండలం చొప్పావారిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలను దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా బొలెరో వాహనాన్ని బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో 12 మంది  ప్రయాణిస్తుండగా యాదాద్రి భువనగిరికి చెందిన చిన్నారి చందన(10) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన 11 మందిని తిరుపతి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి దగ్గరుండి వివరాలు సేకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు