మావోయిజం వీడి రండి 

17 May, 2018 11:25 IST|Sakshi

మావోయిస్టులకు ముఖ్యమంత్రి పిలుపు

భువనేశ్వర్‌ : మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో విలీనం కావాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బుధవారం పిలుపునిచ్చారు. అస్త్రశస్త్రాలు వదిలిపెట్టి అహింస బాట వీడాలని మావోయిస్టులకు సీఎం నవీన్‌ పట్నాయక్‌ హితవు పలికారు. మావోయిజం అణచి వేతకు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు దళాలతో కలిసి ఒడిశా రాష్ట్రం ఉద్యమిస్తోంది. ఈ ప్రక్రియలో రాష్ట్రం సాధించిన ఫలితాలపట్ల కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. ప్రజాస్వామ్యంలో అహింసకు ఏమాత్రం స్థానం లేనట్లు స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు