సైంటిస్టుగా నమ్మించి మహిళకు బురిడీ

6 Oct, 2019 12:15 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

న్యూఢిల్లీ : గతంలో పెళ్లై ఆవారాగా తిరిగే ప్రబుద్ధుడు తాను డీఆర్‌డీఓ సైంటిస్ట్‌నని, అవివాహితుడనని ఢిల్లీకి చెందిన ఓ మహిళను బురిడీ కొట్టించిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిందితుడు ఫోర్జరీ ఐడీ కార్డులను చూపాడని తీరా పెళ్లయిన తర్వాత అతడు మోసగాడని, ఎలాంటి ఉద్యోగం​ లేదని పైగా గతంలో​నే వివాహమైందని తెలిసిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు జితేంద్ర సింగ్‌పై ద్వారకా నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు