-

ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

23 Jan, 2020 08:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర శివారు మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దానమ్మ దోపిడి ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలతోపాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆర్పేందుకు రాజేంద్రనగర్‌ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.  ఈ ప్రమాదంతోఎలాంటి ప్రాణ హానీ జరగలేదు. కాగా ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్కాప్‌ గోదానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనట్లు, సంబంధిత అధికారుల అండదండలతోఈ దందా కోనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు