లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి

16 Aug, 2019 20:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈస్ట్‌జోన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తూ పలు ఫైళ్లకు సంబంధించిన వివారాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ టాక్స్ ఇన్స్‌స్పెక్టర్  రవిప్రసాద్, బిల్ కలెక్టర్ పోచయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఓ భవన యజమాని వద్ద నుంచి 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

మరిన్ని వార్తలు