విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ప్రేమికుడు

5 Jan, 2020 07:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: విద్యార్థినిపై లైంగికదాడి చేసి హత్య చేసిన ప్రేమికుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన రాజగోపాల్‌ కుమార్తె కవిప్రియ (16). ప్లస్‌ వన్‌ చదువుతోంది. ఈమె గత 31వ తేదీ ఇంటి నుంచి బయటికి వెళ్లి ఇంటికి రాలేదు. ఇలావుండగా అక్కడున్న అటవీ ప్రాంతంలో చేతులు, కాళ్లు కట్టివేసిన స్థితిలో కవిప్రియ మృతదేహం కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ దిశగా విచారణ చేపట్టగా ఇనాంమాత్తూరు ప్రాంతానికి చెందిన మదికుమార్‌ (22)తో కవిప్రియ ప్రేమలో ఉన్నట్లు విచారణలో తెలింది. ఈ వ్యవహారంలోనే మదికుమార్‌ కవిప్రియను హతమార్చి ఉండొచ్చని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో కవిప్రియను మదికుమార్‌ హత్య చేసినట్లు తెలిసింది. కవిప్రియ వేరొక యువకునితో సన్నిహితంగా మెలగడం మదికుమార్‌కు నచ్చలేదు. ఆగ్రహించిన అతను సమీపంలోని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి యువకుడితో పరిచయాన్ని మానుకోమని కోరాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన మదికుమార్‌ కవిప్రియపై లైంగికదాడి జరపడమే కాకుండా ఒక బండరాయి తీసుకుని ఆమె తలపై వేశాడు. ఆమె సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. మదికుమార్‌ ఆమె చున్నీతో ముఖాన్ని మూసివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ హత్యలో మదికుమార్‌ స్నేహితులు ముగ్గురికి సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.  

మరిన్ని వార్తలు