విశాఖ రైల్వే స్టేషన్లో కలకలం

5 Nov, 2019 20:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం ఓ ఘటన కలకలం సృష్టించింది. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌ చెందిన ముఠా ప్లాట్‌ఫాం నెంబర్‌ 7 నుంచి హౌరా-యశ్వంత్‌పూర్‌ వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ ముఠాను పట్టుకోడానికి సూమారు వంద మంది సివిల్‌, ఇంటిలిజెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్న నలుగురు పురుషులు, ముగ్గురు స్త్రీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు