ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమజంట

10 Feb, 2018 09:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గుడివాడ: గుడివాడ పట్టణానికి చెందిన ప్రేమజంట విశాఖ జిల్లా అరకులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ రమణ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఓల్డ్‌ ఇండియన్‌ గ్యాస్‌ రోడ్డుకు చెందిన లాం శామ్యూల్‌ సుజిత్‌.. శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్నప్పుడు, సత్యనారాయణపురానికి చెందిన పిళ్లా కిరణ్‌కుమార్‌ భార్య సుప్రియ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఈనెల 6వ తేదీన వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బంధువులు తెలిపారు.

తన భార్య కనిపించట్లేదని సుప్రియ భర్త ఫిర్యాదుతో వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. వీరిద్దరూ విశాఖ జిల్లా అరకు సమీపంలోని వశిష్ట లాడ్జి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వన్‌టౌన్‌ పోలీసులకు తెలియజేశారు. స్పందించిన పోలీసులు అరకు ఎస్సైతో మాట్లాడి.. లాడ్జిలోకి వెళ్లి సుజిత్, సుప్రియను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ రమణ తెలిపారు.

మరిన్ని వార్తలు