ప్రియురాలి కోసం ఆమె మెట్టినింటికి వెళ్లడంతో..

9 Dec, 2019 19:22 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

భింద్‌ : ప్రియురాలి కోసం ఏకంగా ఆమె అత్తవారింటికి వెళ్లిన ప్రబుద్ధుడికి స్ధానికులు దేహశుద్ధి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బింధ్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన వివాహితతో వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి ఏకంగా ఆమె మెట్టినింటికి వెళ్లి పట్టుబడటంతో చావుదెబ్బలు తిన్నాడు. ఈనెల 4న బింధ్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో ఈ ఘటన బయటపడిందని ఎస్పీ రుడాల్ఫ్‌ అల్వార్స్‌ వెల్లడించారు. మహిళ భర్త జైపూర్‌లో పనిచేస్తుండగా ఆమెను కలిసేందుకు వెళ్లిన వ్యక్తిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. మహిళను సైతం చిత్రహింసలకు గురిచేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీరిపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు