తాగిన మత్తులో...

17 Dec, 2018 12:14 IST|Sakshi

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : తాగిన మైకంలో మర్మాంగాన్ని కోసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తిరుమళపుర గ్రామం నివాసి నంజప్ప (48 ) శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో మర్మాంగాన్ని కోసుకున్నాడు. అనంతరం కేకలు వేయడంతో స్థానికులు అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిసింది. పోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు