బతుకమ్మ పూల విషాదం

17 Oct, 2018 10:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అడవిపందులకు పెట్టిన ఉచ్చులో పడి వ్యక్తి మృతి

సాక్షి, కృష్ణా/ఖమ్మం : పండగ పూట విషాదం నెలకొంది. బతుకమ్మ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డాడు. పంటలపై దాడులు చేస్తున్న అడవిపందులను కట్టడిచేయడానికి పెట్టిన మీటా (మందు గుండు ఉచ్చు)కు గురై ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసరెడ్డి (50) మరణించారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం కనుమూరు - చిక్కుళ్లగూడెం మధ్య గల అడవిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు