రెండో పెళ్లి కోసం కుమార్తె హత్య

19 Feb, 2019 12:20 IST|Sakshi
నిందితులు నళిని, మురళి

వేలూరు జిల్లా వానియంబాడిలో దారుణం

తమిళనాడు, వేలూరు: యువకుడితో రెండో వివాహం కోసం పేగు తెంచుకొని జన్మించిన కుమార్తెను తల్లే హత్య చేసిన సంఘటన వానియంబాడిలో సంచలనం రేపింది. వేలూరు జిల్లా వానియంబాడి నేతాజీ నగర్‌కు చెందిన నళిని (26)కి బెంగళూరుకు చెందిన శివకుమార్‌తో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరి గింది. వీరికి జీవిత్‌కుమార్‌ (6), జశ్వంత్‌కుమార్‌ (4), రిత్వికా అనే ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య ఘర్షణలు ఏర్పడటంతో నళిని భర్తను వదిలి కుమార్తె రిత్వికతో కలిసి వానియంబాడిలోని పుట్టింటికి చేరుకుంది.

కుమారులు శివకుమార్‌తో ఉన్నారు. ఈ క్రమంలో చైన్నైకి చెందిన మురళితో నళినికి పరిచయం ఏర్పడింది. చిన్నారితో పాటు మురళి, నళిని వానియంబాడిలో ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ఇదిలాఉండగా శనివారం కుమార్తె రిత్వికకు ఆరోగ్యం సక్రమంగా లేదని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి శరీరంపై గాయాలు ఉండటంతో డాక్టర్లు వానియంబాడి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి నళిని, మురళి వద్ద విచారణ చేపట్టారు. అందరినీ విడిచి వస్తే పెళ్లి చేసుకుంటానని మురళి చెప్పాడని, దీంతో మురళితో కలిసి చిన్నారి గొంతు నొలిమి హత్య చేసినట్టు పోలీసులకు నళిని తెలిపింది. తరువాత చిన్నారికి ఆరోగ్యం క్షీణించిందని నాటకం ఆడి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. దీంతో నిందితులు ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు