ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

20 Jun, 2018 02:27 IST|Sakshi

వేములపల్లి (మిర్యాలగూడ): డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీగాయత్రి ట్రావెల్‌ బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి చీరాలకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30కు బస్సు వేములపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతానికి చేరుకోగా డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ప్రకాశం జిల్లా స్వర్ణ గ్రామానికి చెందిన సుబ్బరావమ్మ(55), బొబ్బాయిపల్లికి చెందిన నాగేశ్వర్‌రావు(31)మృతిచెందారు.

మరిన్ని వార్తలు