విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అకృత్యాలు

20 Feb, 2019 17:18 IST|Sakshi

చెన్నై: విద్యార్థినిని వేధించిన ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద మంగళవారం అరెస్టు చేశారు. తాంబరం సమీపాన గల సోమంగళం ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ముడిచ్చూర్‌లో గల ఒక పాఠశాలలో చదువుతోంది. విద్యార్థినికి గత శనివారం ఆరోగ్యం సరిలేకపోవడంతో ఆ రోజు పాఠశాలకు వెళ్లలేదు. సోమవారం కూడా పాఠశాలకు వెళ్లనందున అనుమానించిన విద్యార్థిని తల్లి ఆమెను ప్రశ్నించింది. ఆ సమయంలో పాఠశాలలో జరిగిన సంఘటనను విద్యార్థిని తల్లికి చెప్పి రోదించింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని తల్లి తాంబరం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరపగా, కంప్యూటర్‌ టీచర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్‌ (30) విద్యార్థినిని కంప్యూటర్‌ ల్యాబ్‌కు తీసుకు వెళ్లి లైంగిక వేధింపులు జరి పినట్లు తెలిసింది. దీంతో క్రౌంపేట, నెమి లిచ్చేరికి చెందిన కంప్యూటర్‌ టీచర్‌ అరుణ్‌కుమార్‌ని పోక్సో చట్టం కింద పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు.

మరిన్ని వార్తలు