పులివెందులలో జంట హత్యలు

21 Mar, 2018 07:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైఎస్సార్‌ జిల్లా : పులివెందులలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. స్థానికంగా నివసిస్తోన్న అశోక్‌ బాబు, ఖాదర్‌ బాషాలను గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. ఖాదర్‌, అశోక్‌లు ఇద్దరూ స్నేహితులు. మద్యంమత్తులో ఈ హత్యలు జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు