మహిళ ఆత్మహత్యాయత్నం!

29 May, 2018 11:28 IST|Sakshi

జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద ఘటన

ఆస్పత్రికి తరలించిన అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అధికారులు గుర్తించి ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ మహిళ గతంలో లైంగికదాడికి గురయ్యారు. తన జీవనాధారం కోసం ఉద్యోగం ఇవ్వాలంటూ ఆమె ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై ఆరా తీసిన కలెక్టర్‌ శశిధర్‌ బాధితురాలికి ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు తిప్పుతున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వెంటనే ఉద్యోగం ఇవ్వాలంటూ ఆదేశించారని తెలిసింది. 

మరిన్ని వార్తలు