అమ్మాయి గొంతు కోసి దారుణ హత్య

5 Aug, 2019 07:16 IST|Sakshi
రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిరా

ఇంటిలోనే ఘాతుకం

శివమొగ్గ జిల్లాలో ఘటన

కర్ణాటక ,శివమొగ్గ : ఇంటిలోనే అమ్మాయి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలుకాలోని హోసమణె శివాజీనగర పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న కాలింగజళ్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన ఇందిరా (16) ఇంటిలోనే అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో మృతి చెందింది. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్‌పీ శాంతరాజుతో పాటు ఇతర సీనియర్‌ అధికారులు, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతురాలు భద్రావతిలోని హొన్నమ్మ కళాశాలలో పీయూసీ చదువుతోంది. శనివారం రాత్రి భోజనం చేసి అందరూ యథావిధిగా నిద్రపోయారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసే సరికి ఓ గదిలో ఇందిరను అతిదారుణంగా గొంతు కోసం ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో  దర్యాప్తు మొదలు పెట్టారు.  

మరిన్ని వార్తలు