క్యాంపస్‌ ఇంటర్వూ్యల్లో 13 మంది ఎంపిక

31 Dec, 2016 00:27 IST|Sakshi
గుత్తి : పట్టణంలోని గేట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో లక్నోకు  చెందిన సీ – కోర్‌ ఇండియా టెక్నో సొల్యూష¯Œ్స సాఫ్ట్‌వేర్‌ కంపెనీ శుక్రవారం ఎంబీఏ, బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వూ్యలు నిర్వహించింది. 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇందులో ఎంబీఏ విద్యార్థులు ముగ్గురు, బీటెక్‌ విద్యార్థులు 10 మంది ఉన్నారు.

ఈ సందర్భంగా కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రదీప్‌వర్మ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపిౖకెన ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.2.4 లక్షల వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను గేట్స్‌ కరస్పాండెంట్‌ వీకే సుధీర్‌రెడ్డి, డైరెక్టర్లు వీకే పద్మావతి, వీకే వాణి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగమల్లేశ్వరరావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌రెడ్డి, పీడీ జోయెల్‌ అభినందించారు.
మరిన్ని వార్తలు