విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి!

12 Dec, 2015 21:19 IST|Sakshi
విశాఖలో ఘరానా మోసం.. రూ.2 కోట్లు కుచ్చుటోపి!

విశాఖపట్నం: విశాఖలో ఘరానా మోసం చోటుచేసుకుంది. మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు నిందితులు యూనియన్ బ్యాంక్కు రూ.2 కోట్లు టోకరా వేశారు. బ్యాంక్ నుంచి నగదు తీసుకుని మోసాలకు పాల్పడ్డ నిందితులు కనకారావు, రవికుమార్ లను అరెస్టు చేసినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టి నిందితుల నుంచి నగదు రికవరీ చేస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు