ఉద్యోగాలకు 25మంది ఎంపిక

22 Oct, 2016 23:21 IST|Sakshi

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : మెడ్‌ప్లస్‌ కంపెనీలో ఫార్మశిస్ట్‌ కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌ ఉద్యోగాలకు 25 మంది ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్‌.వెంకటరమణ తెలిపారు. శనివారం జరిగిన ఇంటర్వ్యూలకు మొత్తం 85 శాతం హాజరయ్యారన్నారు. ఎంపికైన అభ్యర్థులు 24వ తేదీన బెంగుళూరులో రిపోర్ట్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ హెచ్‌ఆర్‌ శ్రావణ్‌కుమార్, జే ఈవో దోనప్ప, గంగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు