ఒంగోలు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం రేణంగిపురం గ్రామం వద్ద ఆదివారం ఉదయం లారీలో అక్రమంగా తరలిస్తున్న 300 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపుకాసిన పోలీసులు రేణంగిపురం శివారులో లారీని ఆపి తనిఖీచేయగా అందులో 300 బస్తాల రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి. వాటిని రేణంగిపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ను అద్పులోకి తీసుకుని విచారిస్తున్నారు.