ఇరువర్గాల మధ్య ఘర్షణ: నలుగురికి తీవ్రగాయాలు

1 Jun, 2016 16:39 IST|Sakshi

సూర్యాపేట (నల్గొండ జిల్లా) : సూర్యాపేట మండలంలోని గాంధీనగర్‌లో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భూమి విషయంలో తలెత్తిన వివాదమే ఈ సమస్య కారణంగా తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు