ఏఈ పరీక్షలకు 63.66 శాతం హాజరు

6 Nov, 2016 20:18 IST|Sakshi

విజయవాడ: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు ఆదివారం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. విజయవాడలో 19 కేంద్రాల్లో ఈ పరీక్షలకు 63.66శాతం మంది హాజరయ్యారు. 

విజయవాడ నుంచి 8,787మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 5,594మంది అభ్యర్ధులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ బాబు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తుగా 144వ సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు