వంటనూనె శుద్ధి కర్మాగారాలపై దాడులు

2 Jul, 2016 18:55 IST|Sakshi

కాకినాడ: వంటనూనె శుద్ధి కర్మాగారాలపై అగ్‌మార్క్‌ అధికారులు శనివారం దాడులు జరిపారు. నకిలీ అగ్‌మార్క్‌ వినియోగిస్తున్న లోహియం కంపెనీ నుంచి రూ. 13 లక్షల విలువైన వంటనూనె స్వాధీనం చేసుకున్నారు. 

నకిలీ శుద్ధి కర్మాగారం యాజమాన్యంపై సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో అగ్‌మార్క్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. వేరుశెనగ, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో 80శాతం పామాయిల్‌ కలుపుతున్నారని అధికారులు గుర్తించారు.

మరిన్ని వార్తలు