చల్లని ప్రయాణం

1 Jun, 2017 23:37 IST|Sakshi
చల్లని ప్రయాణం

తలుపుల : ఏసీ బస్సులు నగరాల్లోనే కాదండోయ్‌..పల్లెల్లోనూ ప్రయాణిస్తున్నాయి. అందుకు నిదర్శమే ఈ ఏసీ బస్సు. మండలంలోని ఓబులరెడ్డిపల్లి రూట్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల వేసవి తాపాన్ని తట్టుకునేందుకు నూతనంగా ఎయిర్‌ కూలర్‌ బస్సును గురువారం ఏర్పాటు చేశారు. ఈబస్సులో ప్రయాణించే వారికి వడదెబ్బ తగలకుండా సైడ్‌ గ్లాస్‌లకు పట్టలు ఏర్పాటు చేసి. వాటికి నీళ్లుపడేలా ఏర్పాటు చేశారు. దీంతో బస్సులో చల్లగా ఉండి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంది. ఈబస్సులో ప్రయాణించేందుకు గ్రామీణుల ఆసక్తి చూపుతున్నారు.

>
మరిన్ని వార్తలు