శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ పర్యటన నేడు

2 Aug, 2016 23:16 IST|Sakshi
విజయనగరం గంటస్తంభం:   శాసనసభ ప్రివిలేజ్‌కమిటీ జిల్లాలో బుధవారం పర్యటించనుందని జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జి.సుర్యారావు అధ్యక్షతన ఏడుగురు సభ్యులు గల ఈ కమిటీ ఉదయం తొమ్మిదిగంటలకు విజయనగరం చేరుకుని వెంటనే జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఇతర అధికారులతో కలెక్టరేట్‌ సమావేశమందిరంలో సమావేశమవుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో అధికారులు పాటిస్తున్న ప్రోటోకాల్‌ అమలును చర్చిస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌ వెళతారు.
 
మరిన్ని వార్తలు