రైల్లోంచి పడిన తల్లీకొడుకులు

8 Jun, 2016 09:51 IST|Sakshi
రైల్లోంచి పడిన తల్లీకొడుకులు

తల్లి మృతి, క్షేమంగా బయటపడిన కుమారుడు..
మృతురాలు యాచకరాలిగా గుర్తింపు

తాండూరు రూరల్ : కదులుతున్న రైల్లోంచి ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు కిందపడ్డారు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన రుక్మాపూర్ - ధారూర్ రైల్వే స్టేషన్ మధ్యలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం మేరకు.. రైల్లో భిక్షాటన చేసే ఓ మహిళ (27), తన ఏడాదిన్న వయస్సున్న కుమారుడితో కలిసి ప్రతి రోజూ తాండూరు - హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లలో భిక్షాటన చేసేది. మంగళవారం కూడా ఆమె ఓ రైలు ఎక్కింది. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తు రుక్మాపూర్ - ధారూర్ మధ్య కేఎం నంబ ర్ 84 వద్ద ప్రమాదవశాత్తు రైల్లోం చి తల్లి, కొడుకులు కిందపడ్డారు. తల్లి అక్కడిక్కడే మృతి చెందగా, కొడుకు క్షేమంగా బయటపడ్డాడు. విషయం తె లుసుకున్న రైల్వే పోలీసులు తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాం డూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలుడిని శిశుగృహానికి తరలించారు. రైల్వే స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు రాజు తెలిపారు. మృతిచెందిన యాచకురాలు చందానగర్ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు