చీరాల : మారుతున్న కాలానుగుణంగా ద్విచక్రవాహనాల వినియోగం పెరిగిపోతుందని, వాహనదారులకు అభీష్టం మేరకు మెరుగైన సేవలందించి సత్ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచించారు. గురువారం పట్టణంలోని సదానందరావు కాంప్లెక్స్లో విష్ణుప్రియ టీవీఎస్ షోరూంను ఘనంగా ప్రారంభించారు. షోరూంను ఎమ్మెల్యే ఆమంచి ప్రారంభించగా చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్కాజల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి హాజరైన పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ఈదర మోహన్ నూతన వాహనాలను విడుదల చేశారు. విష్ణుప్రియ టీవీఎస్ చైర్మన్ కంది రవిశంకర్, కంది సాయినాథ్, ఏరియా సేల్స్ మేనేజర్ డి.సతీష్రెడ్డి, సర్వీస్ మేనేజర్ రాజేంద్ర, డాక్టర్ అన్నె భవానీప్రసాద్, టీడీపీ నాయకులు, షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు.