రాజ్యసభకు కణిమొళి ఎంపికపై సంబరాలు

28 Jun, 2013 05:26 IST|Sakshi
 హొసూరు, న్యూస్‌లైన్:  డీఎంకే పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కణిమొళి రాజ్యసభకు ఎంపిక కావడంతో హొసూరులో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. డీఎంకే  పట్టణ కార్యదర్శి విజయకుమార్ నేతృత్వంలో స్థానిక తాలూకా కార్యాలయం వద్ద ఉన్న అన్నా విగ్రహానికి పూలమాలలు వేసి, బాణసంచా పేల్చి, స్వీట్లు పంచిపెట్టారు.  సంబరాల్లో డీఎంకే నాయకులు ఆగ్రోనాగరాజ్, రామాంజిరెడ్డి, మునిరామప్ప, నటేశన్, గోవింద్, మత్తిగిరి రవికుమార్, నిసార్, టి.వి.కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు