కూకట్ పల్లి సాయిబాబా గుడిలో అక్రమాలు

21 Jul, 2016 21:32 IST|Sakshi

హైదరాబాద్: కూకట్ పల్లి నిజాం పేట సాయిబాబా దేవాలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవాలయానికి చందాల రూపంలో వచ్చిన డబ్బును ఆలయ ట్రస్ట్ మెంబర్లు వాడుకుంటున్నట్లు సినీనటి చల్లా జయలలిత ఆరోపించారు. ఆలయట్రస్ట్ బోర్డు మెంబర్లలో ఒకరైన లతా చౌదరి లక్షలు కాజేశారని జయలలిత తెలిపారు. ఆలయంలో బాబాకు పూజలు నిర్వహిస్తున్న పూజారులు సైతం నిష్టగా ఉండటం లేదని, గుట్కాలు తింటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని భక్తులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు