డీఈఓ ఆకస్మిక తనిఖీ

12 Aug, 2016 01:17 IST|Sakshi
గూడూరు(పాలకుర్తి) : మండలంలోని గూడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను డీఈఓ పి.రాజీవ్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూల్‌లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒకే రోజు సెలవు పెట్టడంపై ఆగ్రహించారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు. విద్యార్థులకు ప్రొగ్రెస్‌ రిపోర్టు అందజేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
 
జనగామ డిప్యూటీ ఈవో యాదయ్య, సర్పంచ్‌ మాచర్ల పుల్లయ్య, ఎంఈవో పోతుగంటి నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు రాంచందర్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు